HYDERABAD: సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర షెడ్యూల్ ఖరారు అయింది. జాతర కార్యక్రమాల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆలయ అధికారులు అందజేశారు. జూలై 19న అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) జరుగుతుంది. ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం మొదలవుతుంది. ఆగస్టు 3న రంగం, అమ్మవారి గజవాహన ఊరేగింపు నిర్వహిస్తారు.
